Friday, May 3, 2024

మరియమ్మ కుమారుడిని పరామర్శించిన డీజీపీ

లాకప్ డేత్ లో మృతి చెందిన మరియమ్మ కుమారుడ్ని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పరామర్శించారు. ఈ ఘటనకు కారణమైన పోలీసుల్ని సస్పెండ్ చేశామని డీజీపీ .. మరియమ్మ కొడుకుకు తెలిపారు. ప్రభుత్వం తప్పకుండా అండగా ఉంటుందని తెలిపారు. దాదాపు 30 నిమిషాల పాటు డీజీపీ ఆస్పత్రిలోనే ఉన్నారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో డిజీపి మాట్లాడుతూ ప్రెండ్లీ పోలిసింగ్‌లో ఇలాంటి ఘటనలు జరగటం బాదాకరమన్నారు. విచారణ సందర్బంలో ఇలాంటి ఘటన జరగటం బాధకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూస్తామన్నారు. బాధిత కుటుంబానికి సహాయ సహాకారాలు అందిస్తామని తెలిపారు. మొత్తం ఘటనపై విచారణ చేస్తున్నామని ఎవరు తప్పు చేసిన కఠిన చర్యలు తప్పవన్నారు. దోషులుగా తేలిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.ఈఘటనలో ఉన్న అధికారులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామన్నారు డీజీపీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement