Friday, May 3, 2024

National : ఇవాళ ఢిల్లీలో మహా పంచాయత్ సభ…

ఇవాళ ఢిల్లీలో కిసాన్‌ మజ్దూర్‌ మహాపంచాయత్‌ నిర్వహించనున్నారు. రాంలీలా మైదానంలో రైతు సంఘాల ఆధ్వర్యంలో భారీ సభ నిర్వహిస్తున్నారు. దేశం నలుమూలల నుంచి, ముఖ్యంగా ఉత్తరాది నుంచి రైతులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పింది.

- Advertisement -

చాలా కాలం నుంచి అపరిష్కృతంగా ఉన్న రైతులు, కూలీల డిమాండ్లపై చర్చించనున్నట్లు వివరించింది. వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కి చట్టబద్ధత కల్పించడం, స్వామినాథన్‌ చెప్పిన సీ2 ప్లస్‌ 50 శాతం సూత్రాన్ని ఉపయోగించి ఎంఎస్‌పీని లెక్కించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement