Sunday, April 28, 2024

AP : కర్నూల్​ జిల్లాలో సీఎంజగన్​ పర్యటన..

ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో సీఎం జగన్​ నేడు పర్యటించనున్నారు. కర్నూలులో జాతీయ న్యాయ విశ్వ విద్యాలయానికి శంకుస్థాపన చేస్తారు. రాష్ట్రంలో ఇది రెండో నేషనల్‌ లా యూనివర్సిటీ. అనంతరం బనగానపల్లేలో 22కోట్లతో నిర్మించిన 100 పడకల ఏరియా ఆస్పత్రిని ఆయన ప్రారంభిస్తారు.

అలాగే.. నంద్యాల జిల్లా బనగానపల్లెలో వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు నగదును బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. బనగానపల్లే హైస్కూల్‌ గ్రౌండ్‌లో జరిగే వైసీపీ బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement