Monday, April 29, 2024

Delhi | డోర్నకల్ – మిర్యాలగూడ రైల్వే లైన్ అలైన్మెంట్ మార్పు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఖమ్మం జిల్లా ప్రజలకు, రైతులకు నష్టదాయకంగా పరిణమించిన డోర్నకల్ – మిర్యాలగూడ నూతన రైల్వే లైన్ అలైన్మెంట్ మార్పు అంశాన్ని పునః పరిశీలిస్తామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అనిల్ కుమార్ జైన్ వెల్లడించారు. తన విజ్ఞప్తిపై స్పందించి రైల్వే జీఎం లేఖ పంపారని బీ‌ఆర్ఎన్ లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

కొత్త రైల్వే లైన్ వల్ల రైతులు, ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నందున అలైన్మెంట్‌లో మార్పులు చేయాలని నామ గతంలో రైల్వే మంత్రిని, రైల్వే బోర్డు చైర్మన్‌ను, జనరల్ మేనేజర్‌ను కలిసి, లేఖలు అందజేశారు. ఈ అంశాన్ని పరిశీలించిన రైల్వే జీఎం ఎంపీ నాగేశ్వరరావు సూచనలను పరిగణనలోకి తీసుకుని, సమస్య పరిష్కరిస్తామని సమాధానం ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement