Saturday, May 4, 2024

ED: మూడోసారి ఢిల్లీ సీఎం డుమ్మా… ఈడీ విచార‌ణ హాజ‌రుకాలేన‌ని లేఖ‌

ఈడీ విచార‌ణ‌కు మూడుసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ డుమ్మా కొట్టారు. విచారణకు కేజ్రీవాల్ హాజరుకావడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ లేఖ రాసింది. ఈడీ సమన్లు చట్ట విరుద్ధమని అరెస్ట్ చేసే ఉద్దేశంతోనే సమన్లు పంపారన్నారు.

ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా… అడ్డుకునేందుకే నోటీసులు ఇచ్చారన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ, మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌ను ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు మూడుసార్లు నోటీసులు ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement