Friday, May 24, 2024

ఢిల్లీ బోనాల సంబురం, వచ్చే ఏడాది నుంచి ప్రత్యేక నిధులు.. ఉత్సవాల్లో పాల్గొన్న కిషన్​రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: వచ్చే ఏడాది నుంచి ఢిల్లీలో నిర్వహించే బోనాల వేడుకలకు నిధులు అందజేస్తామని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో జరిగిన బోనాల వేడుకలకు హాజరైన ఆయన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి లాల్‌దర్వాజ మహంకాళీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్లో బోనాల పండుగను వైభవోపేతంగా నిర్వహిస్తున్నారని, వచ్చే ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో భాగమవుతుందని తెలిపారు. ఈ క్రమంలో తన శాఖ నుంచే వేడుకల నిర్వహణకు అవసరమైన నిధులను అందజేస్తామని వెల్లడించారు. తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన బోనాల పండుగ గురించి దేశ రాజధానిలో అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ఢిల్లీలోని మరిన్ని ఆలయాలను కూడా కలుపుకుని వేడుకలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని లాల్‌దర్వాజ కమిటీని కిషన్ రెడ్డి కోరారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement