Saturday, May 4, 2024

Delhi | కుప్పంలో బాబుకు ఓటమి భయం.. అందుకే కుట్రలు అంటూ గగ్గోలు : ఎంపీ రెడ్డప్ప

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఓడిపోతానన్న భయం పట్టుకుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ (చిత్తూరు) ఎన్. రెడ్డప్ప విమర్శించారు. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన, పుంగనూరు ఘటనపై స్పందించారు. కుప్పం ప్రాంతానికి హంద్రీనీవా నుంచి మరో రెండు నెలల్లో మంచినీళ్లు ఇస్తున్నామని, ఇది చూసి ఓర్వలేక, తట్టుకోలేక కడుపుమంటతో చంద్రబాబు దాడులు చేస్తున్నారని రెడ్డప్ప ఆరోపించారు.

తమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలను నమ్ముకుంటే, చంద్రబాబు నాయుడు మాత్రం కుట్రలను నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నారని, ఇప్పటికే కుప్పం స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కనుమరుగవుతుందన్న భయం ఆయనకు పట్టుకుందని విమర్శించారు. ప్రభుత్వ పథకాలను అమలు చేసే క్రమంలో తెలుగుదేశం కార్యకర్తలకు కూడా ఇవ్వమంటూ తమ ముఖ్యమంత్రి జగన్ గొప్ప మనసు చాటుకుంటున్నారని చెప్పారు. చంద్రబాబు నాయుడు హత్యా రాజకీయాలకు పెట్టింది పేరని, వంగవీటి రంగాను చంపించిన చరిత్ర చంద్రబాబుదే అని రెడ్డప్ప మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement