Wednesday, May 15, 2024

టీఎంసీకి గుడ్ బై చెప్పిన సినీ నటి

సినీ నటి దేబశ్రీ రాయ్ టీఎంసీని వీడారు. ఈ ఎన్నికలలో ఆమెకు టికెట్ దక్కకపోవడంతో చివరకు పార్టీని వీడారు. టీఎంసీ తరపున ఆమె రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 నుంచే పార్టీని వీడాలనే ఆలోచనలో ఆమె ఉన్నారు. పార్టీలో తనకు ఎలాంటి పదవి లేదని… అందువల్ల తన రాజీనామా లేఖను కూడా పార్టీకి పంపించాల్సిన అవసరం లేదని చెప్పారు. అయితే, టీఎంసీతో కలసి ఉండాలనుకోవడం లేదు అనే విషయాన్ని చెప్పడానికే పార్టీ హైకమాండ్ కు లేఖ రాశానని తెలిపారు.

ప్రస్తుతానికి తన యాక్టింగ్ కెరీర్ పైనే దృష్టి సారించాలనుకుంటున్నానని దేబశ్రీ తెలిపారు. అయితే ఏ పార్టీ అయినా సరైన ప్రపోజల్ తో సంప్రదిస్తే ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమని చెప్పారు. 2019లో ఆమె బీజేపీలో చేరడం దాదాపు ఖరారైంది. అయితే టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన సోవన్ చటర్జీ, బైశాఖీ బందోపాధ్యాయ్ లు ఆమె బీజేపీ చేరడాన్ని వ్యతిరేకించారు. దీంతో, కాషాయ పార్టీలో ఆమె చేరిక ఆగిపోయింది. మరోవైపు బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంతో సోవన్ చటర్జీ ఆ పార్టీకి గెడ్ బై చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement