Saturday, May 18, 2024

రెండు చోట్లా ఒకేరోజు ఎన్నికలు, ఒకేరోజు కౌంటింగ్

ఏపీలోని తిరుపతి, తెలంగాణలోని నాగార్జునసాగర్ ఉపఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఏప్రిల్ 17న తిరుపతి, సాగర్ ఉపఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఈ ఉప ఎన్నికలకు సంబంధించి ఈనెల 23న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈనెల 30 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు విధించారు. ఈనెల 31న స్క్రూటినీ ప్రక్రియ కొనసాగతుందని, ఏప్రిల్ 3న నామినేషన్‌లను ఉంహరించుకోవచ్చని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. కాగా వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో తిరుపతి ఉపఎన్నిక, టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో సాగర్ ఉపఎన్నిక జరగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement