కాంగ్రెస్ పార్టీకి దెబ్బమీద దెబ్బ తగులుతూనే ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి చేరుతున్నట్లు ప్రకటించగా… అదేదారిలో దాసోజు శ్రవణ్ కూడా బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన రెండు రోజుల వ్యవధిలోనే దాసోజ్ శ్రవణ్ బీజేపీ గూటికి చేరుకున్నారు. ఢిల్లీలో ఆదివారం ఆయన బీజేపీలో చేరారు. తెలంగాణ వ్యవహారాల బీజేపీ ఇన్ చార్జ్ తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, మాజీ ఎంపీ వివేక్ పలువురు సీనియర్ బీజేపీ నేతల సమక్షంలో కాషాయ కండువా స్వీకరించారు. మంత్రి కిషన్ రెడ్డి, తరుణ్ చుగ్ పార్టీ సభ్యత్వ కార్డును శ్రవణ్ కు అందించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement