Thursday, May 9, 2024

క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్ట్‌.. సిటీలో 10 మంది, వరంగల్‌లో ముగ్గురు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా గుట్టు రట్టైయ్యింది. ఐపీఎల్‌తో పాటు ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ల బెట్టింగ్‌కు పాల్పడుతున్న వారిని సైబరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 10 మంది సభ్యులు గల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి జూదంకి పాల్పడుతున్నారని సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. కాల్‌ సెంటర్‌ ద్వారా కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయని గుర్తించామన్నారు. ప్రధానంగా ఐపీఎల్‌లో బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లుగా నిందితులు ఒప్పుకున్నట్లు చెప్పారు.

వరంగల్‌లోనూ బెట్టింగ్‌ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గుండ్ల సింగారంకు చెందిన ఆటో డ్రైవర్‌ రాజేందర్‌ ఇంటిపై దాడి చేసి క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యవహారాన్ని బయట పెట్టారు. 68 వేల నగదు, 3 మొబైల్‌ ఫోన్లను టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు సీజ్‌ చేశారు. రాజేందర్‌, ప్రమోద్‌, సయ్యద్‌ అంకుస్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొంత మంది నిందితులు పరారీలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement