Monday, April 29, 2024

జగన్ స‌ర్కార్ పై సీపీఐ నారాయణ షాకింగ్ కామెంట్స్

జగన్ స‌ర్కార్ పై సీపీఐ నారాయణ షాకింగ్ కామెంట్స్ చేశారు. వ‌చ్చే ఏడాది జగన్‌ ప్రభుత్వం కూలబోతుంద‌న్నారు. జనం మద్దతు ఉంటే పోలీసుల వలయంలో ఎందుకు తిరుగుతున్నావ్ జగన్ అని ప్ర‌శ్నించారు. కుటుంబ సభ్యులతో కూడా స్వేచ్ఛగా తిరిగలేని జగన్.. ప్రతిపక్ష పార్టీలకు మాత్రం సవాల్ విసురుతున్నాడు అన్నారు. విశాఖపట్నం సీల్ట్ ప్లాంట్ ను బీజేపీ డంపింగ్ యార్డ్ గా మార్చబోతోంద‌న్నారు. ఇలా జ‌రిగితే చూస్తూ ఊరుకోం అన్నారు. మోదీ హ‌టావో.. దేశ్ బచావో నినాదంతో త్వరలో సీపీఐ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపడుతున్నామని నారాయ‌ణ వెల్లడించారు. మోదీ…జగన్ ది నియంత పాలన అని మండిప‌డ్డారు. వీరిద్ద‌రి వ‌ల‌న రాష్ట్ర నాశనం అవుతోందన్నారు. విశాఖ పట్నం సమ్మిట్ లో 13 లక్షల కోట్ల వచ్చాయాంటె హాస్యాస్పదంగా ఉంది…అవన్నీ కాకి లెక్కలన్నారు. మూడు రాజధానులు అన్నప్పుడు ఏపీపై పారిశ్రానిక వేత్తలకు నమ్మకం పోయిందని సిపిఐ నారాయణ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement