Sunday, May 5, 2024

అమిత్‌ షా, జగదీష్ ధన్కర్‌తో టీడీపీ ఎంపీల మర్యాదపూర్వక భేటీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధన్కర్‌తో భేటీ అవ్వడం ఆసక్తి రేకెత్తిస్తోంది. బుధవారం టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్, లోక్‌సభ సభ్యులు కేసినేని నాని, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు జగదీప్ ధన్కర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి తమ మద్దతు తెలిపారు.

ఇప్పటికే ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపిన టీడీపీ, ఉపరాష్ట్రపతి అభ్యర్థికి కూడా మద్దతు తెలిపింది. ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్చమిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నలుగురు ఎంపీలు అమిత్ షాను కూడా మర్యాదపూర్వకంగా కలిశారు. బీజేపీతో మళ్లీ దోస్తీ కోసం తాపత్రయ పడుతున్న టీడీపీ ఇలా ప్రతి అవకాశాన్నీ అందిపుచ్చుకుంటూ మద్దతు ప్రకటిస్తోంది. అధినేత చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకే వారు అమిత్ షా, జగదీప్ ధన్కర్ ని కలిశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement