Wednesday, May 22, 2024

అది మార్ఫింగ్ వీడియో, నాపై టీడీపీ కుట్ర : ఎంపీ గోరంట్ల మాధవ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తనను డ్యామేజ్ చేసేందుకే మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన వీడియోలను సర్క్యులేట్ చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ చెప్పుకొచ్చారు. ఎంపీ మాధవ్ ఓ మహిళతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడుతున్న వీడియో గురువారం సోషల్ మీడియాలో కలకలం రేపింది. న్యూఢిల్లీలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు హాజరువుతున్న ఆయన దీనిపై స్పందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఓ టీవీ ఛానెల్‌పై మండిపడ్డారు. తాను జిమ్ చేస్తున్న సమయంలో తీసిన వీడియోలను మార్ఫింగ్ చేసి చెత్త వీడియోలను సృష్టించి ప్రసారం చేశారని విమర్శించారు. అవన్నీ నిజమని తేలితే తల నరుక్కుంటానని సవాల్ విసిరారురు. ఆయన జిమ్‌ చేస్తున్నట్టుగా ఉన్న వీడియోలను సెల్‌ఫోన్‌లో మీడియాకు చూపించారు. ఇది తెలుగుదేశం పార్టీ కుట్ర అన్న మాధవ్, ఆ పార్టీకి చెందిన చింతకాయల విజయ్, పొన్నూరు వంశీ, శివకృష్ణ చెత్త వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని చెప్పారు.

దమ్ము, ధైర్యం ఉంటే తనను స్ట్రయిట్‌గా ఎదుర్కోవాలన్నారు. వీడియోను టెలికాస్ట్ చేస్తున్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇప్పటికే జిల్లా ఎస్పీకి, సైబర్ సెల్‌కి ఫిర్యాదు చేశానన్నారు. ప్రెస్ కౌన్సిల్, హైకోర్టు, సుప్రీంకోర్టులలో కూడా ఫిర్యాదు చేస్తానని మాధవ్ తెలిపారు. దీని వెనుక అరగుండు అయ్యన్నపాత్రుడు కుట్రదారుడని ధ్వజమెత్తారు. మహానాడులో అయ్యన్నపాత్రుడి కొడుకు తన గురించి అసభ్యంగా మాట్లాడారని మాధవ్ గుర్తు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement