Saturday, April 27, 2024

Breaking: కొవ్వూరులో దంపతుల ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరులో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గోష్పాద క్షేత్రం దగ్గర దంపతులు గోదావరి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మృత‌దేహాల‌ను పోలీసులు వెలికితీశారు. మృతిచెందన దంపతులు ఏలూరుకు చెందిన రిటైర్డు బ్యాంక్ ఉద్యోగి కొండలరావు, అతని భార్యగా గుర్తించారు. అయితే వారు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement