Monday, April 29, 2024

సెప్టెంబర్‌ 6 నుంచి కౌన్సెలింగ్‌.. టీఎస్‌ ఐసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్లో మార్పులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టీఎస్‌ ఐసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో అధికారులు స్వల్ప మార్పులు చేశారు. ఈనెల 14 నుంచి జరగాల్సిన ఐసెట్‌ కౌన్సెలింగ్‌ను వాయిదా వేస్తూ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్‌ 6 నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. 8 నుంచి 12వ తేదీ వరకు అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. 8 నుంచి 13 వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి సమయమిచ్చారు. సెప్టెంబర్‌ 17వ తేదీన ఎంబీఏ, ఎంసీఏ తొలివిడత సీట్లను కేటాయించనున్నారు. సెప్టెంబర్‌ 22 నుంచి ఐసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement