Friday, April 26, 2024

ఏసీబీ వ‌ల‌లో అవినీతి తిమింగ‌లం.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి..

ఏసీబీ అధికారుల‌కు అందిన ప‌క్కా స‌మాచారంతో వ‌ల‌ప‌న్ని లంచం తీసుకుంటుండ‌డ‌గా పంచాయ‌తీ కార్య‌ద‌ర్శిని రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకున్నారు. జనగామ జిల్లా రఘునాథపల్లి గ్రామ గ్రామానికి చెందిన పేర్ని మల్లేశ్‌ అనే వ్యక్తి ఇంటి మ్యుటేషన్‌ విషయంలో పంచాయతీ కార్యదర్శి సంతోష్ ను సంప్రదించాడు. అతడు డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రఘునాథపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతోష్ రూ.4500 తీసుకుంటుండగా ఏసీబీ వరంగల్‌ డీఎస్పీ సుదర్శన్‌ నేతృత్వంలో దాడులు చేప‌ట్టారు. ఇంటి ఆస్థి మార్పిడి విషయంలో గ్రామస్థుడి నుంచి లంచం తీసుకుంటుండ‌గా పంచాయ‌తీ కార్య‌ద‌ర్శిని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. అతనితోపాటు ఇదే గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న సిబ్బంది నగేశ్‌ను కూడా అధికారులు ట్రాప్ చేసి పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement