Tuesday, May 14, 2024

తెలంగాణ వర్సిటీలో కరోనా కలకలం! 20 మంది విద్యార్థులకు పాజిటివ‌క్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీలో కరోనా బారిన విద్యార్థులు పడుతుండటం కలకలం రేపింది. పలువురు విద్యార్థులు జ్వరాలతో బాధపడుతుండటంతో కోవిడ్‌ టెస్టులు చేయించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇప్పటికే 17 మంది విద్యార్థులకు పాజిటివ్‌గా నిర్ధారణ కాగా గురువారం మరో ముగ్గరికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు తెలిసింది. వైరస్‌ సోకిన వారిని నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

మూడు రోజుల కిందట బాయ్స్‌ హాస్టల్లో విద్యార్థులు తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా వారికి అధికారులు కరోనా పరీక్షలు చేయించారు. దాంతో వారికి పాజిటివ్‌గా తేలింది. దీంతో వర్సిటీలోని మిగిలిన విద్యార్థులకు సైతం పరీక్షలు చేశారు. ఇదిలా ఉంటే యాదాద్రి జిల్లా రామన్నపేట ఎస్సీ బాలుర వసతి గృహంలో ముగ్గురు విద్యార్థులకు కరోనా సోకినట్లు తెలిసింది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement