Thursday, May 2, 2024

పెరిగిన క‌రోనా కేసులు.. కొత్తగా 20,279 మందికి పాజిటివ్‌

దేశంలో కొత్తగా 20,279 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,38,88,755కు చేరాయి. ఇందులో 4,32,10,522 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మహమ్మారివల్ల ఇప్పటివరకు 5,26,033 మంది మృతిచెందారు. మరో 1,52,200 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో 36 మంది కరోనాకు బలవగా, 18,143 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో 0.35 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.45 శాతం, మరణాలు 1.20 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 201.99 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement