Thursday, May 2, 2024

తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ… శ్రీవారి ద‌ర్శ‌నానికి 7 గంట‌ల స‌మ‌యం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సన్నిధిలో ఉన్న 26 కంపార్టుమెంట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీవారి సర్వదర్శనానికి 7 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న శ్రీవారిని 78,479 మంది భక్తులు దర్శించుకోగా 37,571 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా రూ. 3.76 కోట్లు ఆదాయం వచ్చిందని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement