Thursday, May 2, 2024

తేనెటీగల దాడిలో.. 20మందికి గాయాలు

తేనెటీగల దాడిలో ముగ్గురు చిన్నారులు సహా 20మందికి గాయాలైన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని చంద్రగిరి మండలం తాటికోనలో గ్రామస్థులపై తేనేటిగలు దాడి చేశాయి. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా ట్రెక్కింగ్‌ కోసం తాటికోన గుట్టకు వెళ్లిన 40 మంది గ్రామస్థులపై ఒక్కసారిగా తేనేటిగలు దాడిచేయడంతో వారు పరుగులు తీశారు. తేనేటిగల బారి నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీస్తున్న క్రమంలో ముగ్గురు చిన్నారులు సహా మొత్తం 20 మందికి గాయాలయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement