Saturday, May 4, 2024

Suryapet: కుటుంబ కలహాలతో కానిస్టేబుల్ ఆత్మహత్య..

కుటుంబ కలహాలతో కానిస్టేబుల్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న విషాద ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటలో చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ అర్రూరి సైదులు (41) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. జిల్లాలోని పెన్పహాడ్ మండలంలోని తన స్వగ్రామమైన ధర్మపురంలో గల తన వ్యవసాయ క్షేత్రం వద్ద ఇవాళ‌ తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికుల ద్వారా తెలిసింది.

ఆర్థిక సమస్యల కలహాల వల్ల భార్యభర్తలు ఇరువురు గొడవ పడగా.. ఆమె కొన్ని రోజుల కిందట పుట్టింటికి వెళ్లింది. దీంతో సైదులు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. 2004 బ్యాచ్ కి చెందిన సైదులు ప్రస్తుతం జిల్లా కేంద్రంలోనే అద్దె ఇంట్లో ఉంటూ అదనపు ఎస్పీ నాగేశ్వరావు వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్నారు. కాగా మృతుడికి భార్య, ఒక కూతురు, కుమారుడు ఉన్నట్లు తెలిసింది. ఆయన మృతికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement