Monday, April 29, 2024

నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు: మనవతా రాయ్..

ఓయూ విద్యార్థి నేత‌, ద‌ళిత నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నేత మాన‌వ‌తా రాయ్ పై పోలీసుల దాడి ఆంశం స‌ర్వ‌త్రా చర్చనీయంశంగా మారుతోంది. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని మానవత రాయ్ హైకోర్టును ఆశ్రయించారు. తనను అక్రమంగా అరెస్ట్ చేసి దాడి చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి అని హైకోర్టు ను కోరారు మమవత రాయ్. ఎలాంటి నోటీస్ లు లేకుండా అరెస్ట్ చేసి, తనపై దాడి చేశారని తన పిటిషన్ లో పేర్కొన్నా మానవత రాయ్. అక్రమ అరెస్ట్ తో 24 గంటలపాటు తనను నిర్బంధించారని, 25 లక్షల నష్టపరిహారం చెల్లించేలా పోలీస్ డిపార్ట్మెంట్ ను ఆదేశించాలని కోరారు మానవత రాయ్. తనపై దాడి చేసిన పోలీస్ అధికారిపై కేసు నమోదు చేయాలని కోరిన మానవత రాయ్..తన కేసులో డీజీపీ, మిర్యాలగూడ, నల్గొండ ఎస్పీలను, బాషా టాస్క్ ఫోర్స్, నాగార్జున సాగర్ సీఐ లను ప్రతివాదులుగా చేర్చారు మమవత రాయ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement