Tuesday, May 7, 2024

రైతు కూలీ ఆత్మహత్య..

ఎల్లారెడ్డిపేట: మండలంలోని వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన ఎమ్మ పవి (45) అనే వ్యక్తి గ్రామంలోని రంగనాయకుల గుట్ట ప్రాంతంలోని అడవిలో చెట్టుకు ఉరి పోసుకొని ఆత్మ హత్యకు పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు. ఆర్థిక బాధలు తట్టుకోలేక, అప్పులు తీర్చే మార్గం కానరాక బలవన్మరణంకు పాల్పడి ఉంటాడని గ్రామస్థులు భావిస్తున్నారు. గతంలో దుబాయికి వెళ్లిన పవి అక్కడ పని లేక స్వగ్రామానికి తిరిగి వచ్చాడని, అతనికి ఉన్న 30 గంటల వ్యవసాయ పొలం నీరు లేక ఎండిపోవడంతో పంటపై పెట్టిన పెట్టు బడి రాని పరిస్థితి. అప్పులు తీరే మార్గం కాన రాక ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని బంధువులు, గ్రామస్థులు తెలిపారు. రైతు కూలీ పవీ ఆత్మహత్య సమాచారాన్ని గ్రామస్థుల ద్వారా తెలుసుకున్న పోలీసులు మృతదేహానికి పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని సిరిసిల్ల ప్రాంతీయ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య రేణుక, పెళ్లికి వచ్చిన కూతురు కల్యాణి, కుమారుడు శేఖర్‌ ఉన్నారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని బిజెపి మండల శాఖ అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement