Sunday, May 5, 2024

నిరసన ప్రదర్శనలో ఎడ్లబండి నుంచి కిందపడిపోయిన దామోదర్ రాజనర్సింహ

దేశంలో పెట్రోల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెరిగిన పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు మెదక్‌లో నిరసన ప్రదర్శన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ధర్నాచౌక్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, సీనియర్ నేత గీతారెడ్డి పాల్గొన్నారు.

అయితే ఈ నిరసన కార్యక్రమాల్లో ఎడ్లబండ్లను కూడా ప్రదర్శనకు తీసుకువచ్చారు. ఓ ఎడ్లబండి పైనుంచి రాజనర్సింహ ప్రసంగిస్తుండగా అపశ్రుతి చోటుచేసుకుంది. ఎడ్లు ఒక్కసారిగా బెదరడంతో బండి కుదుపులకు గురై, బండిపై ఉన్న రాజనర్సింహ కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. మోకాలికి దెబ్బతగలడంతో వైద్యులు చికిత్స అందించారు.

ఈ వార్త కూడా చదవండి: పెట్రోల్ ధరలపై తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు

Advertisement

తాజా వార్తలు

Advertisement