Thursday, April 25, 2024

ఆగస్టులో మహాప్రస్థానం !!

టాలీవుడ్ యంగ్ హీరో తనీష్ ప్రధాన పాత్రలో జానీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం మహాప్రస్థానం. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో ముస్కాన్ సేథీ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే భానుశ్రీ మెహ్రా, కబీర్ దోహా సింగ్, రాజా రవీంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ ,మోషన్ పోస్టర్, టీజర్ ల కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

కాగా ఈ సినిమాను ఆగస్టులో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే కరోనా కారణంగా చాలా సినిమాలు రిలీజ్ డేట్ వాయిదా వేసుకున్నాయి. ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పడుతుండటంతో రిలీజ్ కు చాలా సినిమాలు సిద్ధం అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement