Tuesday, May 7, 2024

ముగిసిన తొర్రూరు లేఅవుట్‌ వేలం.. మొత్తం 48 ప్లాట్ల‌కు ఆన్‌లైన్‌లో వేలం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తొర్రూరు హెచ్‌ఎండీఏ లేఅవుట్‌లో మిగిలిన ప్లాట్ల అమ్మకాలకుగాను చివరి రోజు సోమవారం 48 ప్లాట్లకు ఆన్‌లైన్‌ ద్వార వేలం ప్రక్రియ జరిగింది. హైదరాబాద్‌ మెట్రో పాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎంఎస్‌టీసీ నిర్వహించిన ఆన్‌లైన్‌ వేలం (ఈ-ఆక్షన్‌)లో ప్లాట్లు మార్నింగ్‌ సెషన్‌లో 25 ప్లాట్లు, ఈవినింగ్‌ సెషన్‌లో 23 ప్లాట్ల చొప్పున వేలం ప్రక్రియను నిర్వహించారు. మార్నింగ్‌ సెషన్‌లో 25 ప్లాట్లకుగానూ ఐదు ప్లాట్లకు బిడ్డింగ్‌ జరిగింది.

అత్యధికంగా గజం రూ.30వేలు ధర పలుకగా, అత్యల్పంగా గజం రూ.20,500 బిడ్డర్లు కోట్‌ చేశారు. ఈవినింగ్‌ సెషన్‌లో 23 ప్లాట్లకుగానూ ఏడు ప్లాట్లకు బిడ్డింగ్‌ జరిగింది. అత్యధికంగా రూ.30వేల ధర పలుకగా, అత్యల్పంగా గజం రూ.20,500లకు బిడ్డర్లు కోట్‌ చేశారు. సోమవారి చివరి రోజున జరిగిన వేలం ద్వారా రూ.8.10 కోట్ల విలువజేసే 12 ప్లాట్ల అమ్మకాలు జరిగాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement