Friday, May 3, 2024

టీఆర్ఎస్‌లో గ్రూప్ వార్.. మల్లారెడ్డిపై సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు

టీఆర్‌ఎస్‌ పార్టీలో మరోసారి గ్రూప్‌ రాజకీయాలు బయటపడ్డాయి. తాజాగా మంత్రి మల్లారెడ్డిపై మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేడ్చల్ జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి కలిసి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫిర్యాదు చేశారు. తనపై మంత్రి మల్లారెడ్డి అవాకులు చెవాకులు పేలుతున్నారని, జిల్లాలో గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని జెడ్పీ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే ఇప్పుడు అందరూ కలిసి మెలిసి పార్టీ బలోపేతం కోసం పని చేయాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సర్ది చెప్పారు. ఢిల్లీ పర్యటన ముగిసిన తరువాత మరోసారి మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ నేతలతో సమావేశం అవుతానని నేతలకు చెప్పారు. అనంతరం మేడ్చల్ జిల్లాలో నాయకుల మధ్య మంత్రి మల్లారెడ్డి గొడవలు పెడుతున్నారని శరత్ చంద్రారెడ్డి మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే అన్ని సర్దుకుంటాయని కేటీఆర్ చెప్పారని ఈ సందర్భంగా మీడియాకు శరత్ చంద్రారెడ్డి వెల్లడించారు. తన రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నానని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement