Friday, April 19, 2024

భద్రాద్రి జిల్లాలో రెచ్చిపోయిన కామాంధుడు

తెలంగాణలో మహిళపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. సైదాబాద్ లో ఆరేళ్ల చిన్నారి హత్యాచారం ఘటన మరువక ముందే.. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారానికి యత్నించాడు ఓ కీచకుడు. దివ్యాంగులైన బాధిత యువతి ఇంట్లో ఉండగా.. మోతీలాల్ అనే వ్యక్తి అత్యాచారం చేసేందుకు యత్నిస్తున్నట్లు గమనించిన స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. సంఘటన జరిగిన ప్రదేశానికి వచ్చిన పోలీసులు.. మద్యం మత్తులో ఉన్న మోతీలాల్​ను పోలీస్​ స్టేషన్​కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఇది కూడా చదవండి: ఏపీని వదిలేసి తెలంగాణకు వస్తా: ఏపీ టీడీపీ నేత జేసీ

Advertisement

తాజా వార్తలు

Advertisement