Friday, May 3, 2024

క‌మ్ బ్యాక్ యువీ..మీ ప్రేమ‌కి కృతజ్ఞుడిని

టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ తన అభిమానులకు శుభవార్త చెప్పాడు. ‘‘ఆ దేవుడే నీ గమ్యాన్ని నిర్దేశిస్తాడు!! పబ్లిక్‌ డిమాండ్‌ మేరకు ఫిబ్రవరిలో మైదానంలో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇంతకు మించిన గొప్ప అనుభూతి ఇంకోటి ఉండదు! మీ ప్రేమ, ఆభిమానాలకు కృతజ్ఞుడిని! మీ మద్దతు ఇలాగే కొనసాగాలి. నిజమైన అభిమాని… కఠిన సమయాల్లో మనకు మద్దతుగా ఉంటారు’’ అని ఫ్యాన్స్‌ కోరిక మేరకు త్వరలోనే మళ్లీ మైదానంలో అడుగుపెడతానని పేర్కొన్నాడు. అన్నీ సజావుగా సాగితే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో క్రికెట్‌ ఫీల్డ్‌లో తనను చూసే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement