Saturday, May 4, 2024

Delhi | తెలంగాణ నుంచి ఉప్పుడు బియ్యం సేకరించండి.. సివిల్ స‌ప్ల‌యీస్‌కి కిషన్ రెడ్డి లేఖ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రైతు సంక్షేమంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వంలోని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతులకు కేంద్రప్రభుత్వం.. నిరంతరం మద్దతుగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఇకపైనా ఈ సహాయాన్ని కొనసాగిస్తూ.. ఈ ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ లో తెలంగాణ నుండి 15 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యం (పార్ బాయిల్డ్ రైస్) సేకరించమని కోరుతూ కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖమంత్రి పీయూష్ గోయల్ కు లేఖ రాశారు.

2015-16 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ లో 5.35 లక్షల మంది రైతులు కేంద్ర ప్రభుత్వ ధాన్య సేకరణ ద్వారా లబ్ధి పొందగా.. గత సీజన్లో 20 లక్షలమంది తెలంగాణ రైతులు లబ్ధిపొందారని కిషన్ రెడ్డి ఆ లేఖలో గుర్తుచేశారు. తెలంగాణ రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని, ఈ ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో రాష్ట్రం నుంచి 15 లక్షల మెట్రిక్ టన్నుల పార్ బాయిల్డ్ రైస్ సేకరణకు ఉపక్రమించాలని పీయూష్ గోయల్ ను కిషన్ రెడ్డి కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement