Sunday, April 28, 2024

ఎమోషనల్ విలేజ్ డ్రామా “బలగం”.. క్రిటిక్స్ ఛాయిస్ లో మరో ఇంటర్నేషనల్ అవార్డ్

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెద్ నటీ నటులు ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్స్ గా దర్శకుడు వేణు యెల్దండి తెరకెక్కించిన లేటెస్ట్ ఎమోషనల్ విలేజ్ డ్రామా “బలగం”. తెలుగు రాష్ట్రాల్లో ఫామిలీ ఆడియెన్స్ ని ఎంతగానో కదిలించిన ఈ సినిమాకి అంతర్జాతీయ లెవెల్లో పలు అవార్డులు వరుసగా వస్తూ ఉండడం విశేషం. కాగా లేటెస్ట్ గా మరో ప్రముఖ ఇంటర్నేషనల్ అవార్డ్స్ లో ఈ సినిమా మెరిసింది.

ఇండో ఫ్రెంచ్ మూవీ ఫెస్టివల్ లో ఈ సినిమాకి క్రిటిక్స్ ఛాయిస్ లో వేణుకి అలాగే హీరో ప్రియదర్శికి బెస్ట్ పెర్ఫామర్ గా రెండు అవార్డులు దక్కాయి. దీనితో ఈ విషయాన్నీ దిల్ రాజు నిర్మాణ సంస్థ వారు షేర్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. అలాగే ప్రియదర్శి కూడా ఈ విషయంలో ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement