Monday, April 29, 2024

పేదల పాలిట వరం సీఎంఆర్ఎఫ్ – ఎమ్మెల్యే దాస‌రి

అనారోగ్యాల బారిన పడిన మీరు పేదలపాలిట ముఖ్యమంత్రి సహాయనిధి వరంగా మారిందని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో నియోజకవర్గానికి చెందిన 140 మంది లబ్ధిదారులకు 48,70,000 రూపాయల చెక్కుల పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన ప్రజలు అనారోగ్యాల బారిన పడి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకుంటే ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఆర్థిక చేయూత అందిస్తున్నామన్నారు. పేదల ఆరోగ్యం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. ప్రభుత్వాసుపత్రుల బలోపేతానికి వేలాది కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నామని, ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులతో పాటు తెరాస నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement