Friday, April 26, 2024

మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించిన సీఎం కేసీఆర్ సతీమణి

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామునుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించుకుంటున్నారు. సీఎం కేసీఆర్ సతీమణి శోభ కుటుంబ సభ్యులతో కలిసి ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి బోనం, పట్టువస్ర్తాలు సమర్పించారు. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అమ్మవారిని దర్శించుకుని పట్టువస్తాలు సమర్పించారు. మరోవైపు రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్‌, సినీ నిర్మాత దిల్‌ రాజు దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు.

ఈ వార్త కూడా చదవండి: ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మంత్రి తలసాని బోనం

Advertisement

తాజా వార్తలు

Advertisement