Sunday, May 19, 2024

వ‌న‌ప‌ర్తికి బ‌య‌ల్దేరిన సీఎం కేసీఆర్

రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ‌న‌ప‌ర్తి జిల్లాకు బ‌య‌ల్దేరారు. వన‌పర్తి జిల్లాలో ఆయ‌న‌ పర్య‌టిం‌చ‌ను‌న్నారు. పలు అభి‌వృద్ధి కార్య‌క్ర‌మాల ప్రారం‌భో‌త్స‌వాలు, శంకు‌స్థా‌ప‌నలు చేయ‌ను‌న్నారు. ఇందు‌కోసం అధి‌కా‌రులు భారీ ఏర్పాట్లు చేశారు. వన‌పర్తి వ్యవ‌సాయ మార్కె‌ట్‌‌యార్డు ఆవ‌ర‌ణలో ఏర్పాటు చేసిన హెలి‌పా‌డ్‌కు చేరుకొని అక్కడే అగ్రి‌క‌ల్చర్‌ మార్కెట్‌ యార్డును ప్రారం‌భి‌స్తారు. అలాగే వనపర్తిలోని జడ్పీ ఉన్నత (బా‌లుర) పాఠ‌శా‌లకు చేరు‌కొం‌టారు. ‘మ‌న‌ఊరు – మన‌బడి, మన‌బస్తీ – మన‌బడి’ కార్య‌క్ర‌మా‌నికి శ్రీకారం చుట్ట‌ను‌న్నారు. అనంత‌రం విద్యా‌ర్థు‌ల‌ను‌ద్దే‌శించి ప్రసం‌గి‌స్తారు. అలాగే నాగ‌వ‌రం‌లోని టీఆ‌ర్‌‌ఎస్‌ జిల్లా కార్యా‌ల‌యాన్ని ప్రారం‌భి‌స్తారు. అనంత‌రం కలె‌క్ట‌రే‌ట్‌ను ప్రారం‌భించి ప్రజా‌ప్ర‌తి‌ని‌ధులు, అధి‌కా‌రు‌లతో సమా‌వేశం నిర్వ‌హి‌స్తారు. ప్రజా‌ప్ర‌తి‌ని‌ధు‌లతో కలిసి భోజనం చేస్తారు. అనంత‌రం ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీకి శంకుస్థాప‌న చేయ‌నున్నారు. వైద్య కళా‌శాల ఆవ‌ర‌ణలో నిర్వ‌హించే భారీ బహి‌రం‌గ‌స‌భలో ప్రజలు, పార్టీ శ్రేణు‌ల‌ను‌ద్దే‌శించి ప్రసం‌గించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement