Friday, May 3, 2024

1 నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు

తిరుమల, ప్రభన్యూస్‌ : తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్‌ 1 వ తేది నుంచి ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభించి భక్తులను అనుమతించాలని టిటిడి నిర్ణయించింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ, మెెల్‌చాట్‌ వస్త్రం, అభిషేకం, కళ్యా ణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను నిర్వహిస్తారు. కోవిడ్‌ – 19 పరిస్థితుల ముందున్న విధానంలోనే ఆర్జిత సేవా టికెట్ల బుకింగ్‌ కొనసాగుతుంది. అదేవిధంగా కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలకు సంబంధించి భక్తులు నేరుగా పాల్గొనే విధానంతో పాటు వర్చువల్‌ విధానం కూడా కొనసాగుతుంది. వర్చువల్‌ సేవలను బుక్‌ చేసుకున్న భక్తులు ఆయా సేవల్లో నేరుగా పాల్గొనే అవకాశం లేదు. వారికి దర్శనం కల్పించడంతో పాటు ప్రసాదాలు అందిస్తారు. అడ్వాన్సు బుకింగ్‌లో ఆర్జిత సేవలను బుక్‌ చేసుకున్న వారిని, ఉదయాస్తమాన సేవ, వింశతి వర్ష దర్శిని సేవలు బుక్‌ చేసుకున్న వారిని ఏప్రిల్‌ 1వ తేది నుంచి కోవిడ్‌ – 19 నిబంధనలు పాటిస్తూ ఆయా సేవలకు అనుమతిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement