Sunday, April 28, 2024

భ‌ద్రాచ‌లంలో సీఎం కేసీఆర్‌.. గోదావ‌రి న‌దికి శాంతి పూజ ..

వ‌ర్షాల‌ను సైతం లెక్క చేయ‌కుండా రోడ్డు మార్గాన ముఖ్య‌మంత్రి కేసీఆర్ భ‌ద్రాచ‌లం చేరుకున్నారు. ఉప్పొంగి ప్ర‌వ‌హిస్తున్న గోదావ‌రి న‌దికి సీఎం కేసీఆర్ శాంతి పూజ నిర్వ‌హించారు. వంతెన పైనుంచి గోదావ‌రి ప‌రిస‌రాల‌ను సీఎం ప‌రిశీలించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు పువ్వాడ అజ‌య్ కుమార్, హ‌రీశ్‌రావు, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, స‌త్య‌వతి రాథోడ్‌తో పాటు ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. మ‌రికాసేప‌ట్లో గోదావరి వరద తాకిడికి గురైన కరకట్టను పరిశీలిస్తారు. అక్కడ నుంచి వరద ముంపు బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి సీఎం కేసీఆర్ చేరుకుంటారు. వరద బాధితులను పరామర్శిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement