Monday, March 25, 2024

లారీ బోల్తా.. డ్రైవ‌ర్ మృతి

జగిత్యాలలోని టీఆర్‌ నగర్‌లో యూరియా లోడ్‌తో వెళ్తున్న లారీ.. ఆర్టీసీ బస్సును ఓవర్‌టేక్‌ చేయబోయి ఎదురుగా వస్తున్న కారును, పక్కనే ఉన్న బస్సు ఢీకొట్టింది. ఈ క్రమంలో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో బోల్తాడింది. దీంతో లారీ డ్రైవర్‌ బాబా అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లారీ డ్రైవర్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. బస్సు, కారులో ప్రయాణిస్తున్నవారు క్షేమంగా ఉన్నారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement