Sunday, May 5, 2024

సీఎం సారుకు జరిమానా ఎందుకు వేయరు?

తెలంగాణలో మాస్కు లేకుంటే పోలీసులు రూ.1,000 ఫైన్ విధిస్తున్నారు. నాగార్జునసాగర్ ఎన్నికల ప్రచారంలో పలు పార్టీల నేతలకు మాస్కు ధరించని కారణంగా ఫైన్ వేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. బుధవారం నాడు సాగర్ ఉపఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన హాలియా సభలో సీఎం కేసీఆర్ మాస్కు ధరించలేదు. ప్రసంగం చేసేటప్పుడు మాస్కు ఇబ్బంది అనుకున్నా స్టేజీపై కూర్చున్నప్పుడు కూడా కేసీఆర్ మాస్కు ధరించలేదు. మరి సీఎం కేసీఆర్ నిబంధనలు ఉల్లంఘించారు కాబట్టి రూ.1,000 జరిమానా విధిస్తారా? అని సామాన్యులు పోలీసులను ప్రశ్నిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement