Thursday, April 25, 2024

బ్యాట్ తో కుర్చీని కొట్టిన కోహ్లీ..మందలించిన రిఫరీ

బెంగ‌ళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి సహనం కోల్పోయాడు. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో మ్యాచ్ లో కోహ్లి 29 బంతుల్లో 33 ప‌రుగులు చేసి అవుటైనాడు. అయితే అనంతరం ఆర్సీబీ డ‌గౌట్ వైపు వెళ్తూ బౌండ‌రీ ద‌గ్గ‌ర అడ్వ‌ర్‌టైజింగ్ బోర్డు, ఆ త‌ర్వాత ఓ కుర్చీని బ్యాట్‌తో కొడుతూ వెళ్లాడు. ఇది ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండ‌క్ట్ ప్ర‌కారం లెవ‌ల్ 1 నేరం. క్రికెట్ ప‌రికరాలు లేదా బ‌ట్ట‌లు, మైదానంలోని ప‌రిక‌రాలు, హోర్డింగ్‌ల ప‌ట్ల‌ మ్యాచ్ సంద‌ర్భంగా అనుచితంగా ప్ర‌వ‌ర్తించ‌డానికి నేరంగా ప‌రిగ‌ణిస్తారు. దీని ప్ర‌కారం కోహ్లిది లెవ‌ల్ 1 నేరంగా ప్ర‌క‌టించిన రిఫ‌రీ అత‌న్ని మంద‌లింపుతో వ‌దిలేసిన‌ట్లు ఐపీఎల్ ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement