Thursday, May 2, 2024

TS | చెరువు మ‌ట్టి త‌ర‌లింపులో ఇరువర్గాల ఘర్షణ.. ఇద్దరికి గాయాలు

నల్లబెల్లి, (ప్రభ న్యూస్): పంట పొలాలకు చెరువు మట్టి తరలిస్తున్న క్రమంలో గ్రామంలోని ఇరువార్గాల రైతుల మధ్య ఘర్షణ జ‌రిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు గాయాలు అయినట్లు గ్రామస్తులు తెలిపారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని లెంకాలపెల్లిలోని ఊర చెరువు నంచి గ్రామ రైతులు మట్టిని జెసీబీ ద్వారా ట్రాక్టర్ల తో పంట పొలాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో ట్రాక్టర్ల యజమానుల మధ్య నెలకొన్న ఘర్షణలో భాగంగా యదండ్ల కుమారస్వామి, అతడి కుమారుడు యడండ్ల గణేష్.. మాజీ సర్పంచ్ గన్నెబోయిన చేరాలు, అతని తమ్ముడు గన్నేబోయిన లక్ష్మణమూర్తిపై దాడి చేశారు.

దీంతో ఇద్ద‌రికి తీవ్ర గాయాలు కాగా కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నర్సంపేట లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న నల్లబెల్లి పోలీసులు చెరువులో మట్టిని తీస్తున్న జెసిబి ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న‌ట్టు ఎస్సై నైనాలా నగేష్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement