Thursday, May 16, 2024

రాచకొండ పోలీసులకు లొంగిపోయిన సీఐ నాగేశ్వరరావు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మహిళను బెదరించి అత్యాచారానికి పాల్పడటంతో పాటు మహిళతో పాటు ఆమె భర్తను కిడ్నాప్‌ చేసి తరలిస్తూ అడ్డంగా బుక్కైన సీఐ నాగేశ్వరరావు పోలీసుల ముందు ఆదివారం సాయంత్రం లొంగిపోయారు. అవుటర్‌ రింగ్‌ రోడ్‌ సమీపంలోని పెద్ద అంబర్‌పేట ప్రాంతంలో రాచకొండ పోలీసుల ముందు సరెండర్‌ అయ్యారు.

తనపై నమోదైన కేసు దర్యాప్తు నిస్పక్షపాతంగా జరగాలని ఈ సందర్భంగా పోలీసులను నాగేశ్వరరావు కోరారు. కేసు విచారణలో పూర్తి స్థాయిలో సహకరిస్తానని హామీ ఇచ్చాడు. సరెండర్‌ అయిన సీఐని రాచకొండ పోలీసులు రహస్య ప్రదేశానికి తరలించారు. ఘటనపై వివరాలను సేకరిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement