Sunday, May 5, 2024

China Masters |ఫైన‌ల్స్‌కి దూసుకెళ్లిన సాత్విక్- చిరాగ్ జోడీ

చైనాలో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఇవ్వాల (శనివారం) జ‌రిగిన సెమీఫైనల్స్ మ్యాచ్ లో భార‌త ప‌రుషుల డ‌బుల్స్ జంట సాత్విక్‌-చిరాగ్ చైనీస్ జోడీ హీ జీ టింగ్-రెన్ జియాంగ్ యుపై నెగ్గి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

వారం క్రిత‌మే జ‌పాన్ మాస్ట‌ర్స్ టైటిల్ గెలిచిన ఈ చైనా జంట‌పై భార‌త జోడీ రెండు సెట్ల‌లో ఆధిప‌త్యం చెలాయించి 21-15, 22-20 స్కోరు తేడాతో గెలుపోందింది. ఇక, ప్ర‌స్తుతం మ‌రో సెమీఫైన‌ల్ మ్యాచ్ లో హెన్ బో యాంగ్-లియు యి & లియాంగ్ వీ కెంగ్-వాంగ్ చాంగ్ త‌ల‌ప‌డుతున్నారు. కాగా, ఈ మ్యాచ్ విజేతలతో రేపు (ఆదివారం) జరిగే ఫైనల్‌లో సాత్విక్‌-చిరాగ్ పోటీప‌డ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement