Monday, April 29, 2024

ISRO | చివరి దశకు చేరుకున్న ఆదిత్య L1 స్పేస్‌క్రాఫ్ట్..

సూర్యూనిపై పరిశోధనలు చేసేందుకు ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా ‘ఆదిత్య ఎల్‌1’ ప్రాజెక్టు చేపట్టింది. అయితే, ఇప్పుడు ఆదిత్య ఎల్1 తన ప్రయాణంలో చివరి దశకు చేరుకుందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. ఈ నౌక గమ్యస్థానానికి చేరుకోవడానికి ఇంకా ఒకటిన్నర నెల సమయం పట్టే అవకాశం ఉందంటూ ప్రకటించారు. అంటే జనవరి 7 కల్లా ఆదిత్య వ్యోమనౌక ఎల్-1 పాయింట్ కు చేరుకునేందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తవుతాయని చెప్పారు. ప్రస్తుతం తుది ఏర్పాట్లను చేస్తున్నామని తెలిపారు.

ఈ ప్రయోగాన్ని సెప్టెంబర్ లోనే మొదలు పెట్టగా… 125 రోజుల్లో 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత సూర్యునికి సమీపంలో ఉన్న ఎల్-1 పాయింట్ ను చేరుకునే లక్ష్యంతో దీన్ని ప్రయోగించారు. ఎల్-1 పాయింట్ నుంచి సూర్యుడి చిత్రాలను తీసి భూమికి పంపించనుంది. సూర్యుడిపై లోతుగా అధ్యయనం చేసేందుకు ఇవి ఇస్రోకు ఉపయోగపడనున్నాయి. దీంతో సూర్యునిపై కూడా మొద ప్రయోగం చేసిన దేశంగా ఇండియా అవతరించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement