Tuesday, May 14, 2024

Katrina Kaif | 20 ఏళ్లుగా క‌త్రినా కైఫ్ జోరు… నాకు నేనే పోటీ అంటున్న మ‌ల్లీశ్వ‌రి

క‌త్రినా కైఫ్ బాలీవుడ్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ‘భూమ్’ సినిమాతో తెరంగేట్రం చేసిన అమ్మ‌డి కెరీర్ దేదీప్య మానంగా సాగిపోతుంది. కెరీర్ లో ఎన్నో జ‌యాప‌జాలు చూసింది. ప్ర‌స్తుతం సీనియ‌ర్ నాయికల‌తో పోటీ ప‌డుతూ త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. యువ న‌టుడు విక్కీ కౌశ‌ల్ ని ప్రేమ వివాహం చేసుకుని ధాంప‌త్య జీవితంలోనూ సంతోషంగా ఉంది. క్యాట్ కెరీర్ ఆరంభంలో ‘మ‌ల్లీశ్వ‌రి’ చిత్రంలో న‌టించిన సంగ‌తి తెలిసిందే.

తొలి సినిమాతోనే తెలుగు నాట పాపుల‌ర్ అయింది. అటుపై ‘అల్ల‌రి ప్రియుడు’ అనే మ‌రో సినిమాలో కూడా న‌టించింది. కానీ కెరీర్ ని హిందీలోనే నిర్దేశించుకుంది. దీంతో తెలుగు ప‌రిశ్ర‌మ‌కు దూర‌మైంది. తాజాగా క‌త్రినా బాలీవుడ్ జ‌ర్నీ కి 20 ఏళ్లు ముగిసాయి.

ఈ సంద‌ర్భంగా క్యాట్ జ‌ర్నీని ఉద్దేశించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ’20 ఏళ్ల సినీ జీవితంలో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నా. ఇన్నేళ్ల జ‌ర్నీలో నాతోనే పోటీ ప‌డ్డా. ప్ర‌తి సినిమాలో నా న‌ట‌న నేనే పొల్చుకుంటా. బాగా చేసానా? లేదా? అని నాకు నేనే విశ్లేషిషించుకుంటా. నాధ్యాశంతా ప‌నిపైనే ఉంటుంది. బుర్ర‌లోకి మ‌రో ఆలోచ‌న రాకుండా ప‌నిచేస్తా. విరామం అంటే అస్సలు న‌చ్చ‌దు అని తేల్చేసింది..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement