Monday, May 13, 2024

రైలు పట్టాలపై చిన్నారి: కాపాడిన ఉద్యోగి

రెప్పపాటు కాలంలో  ఒక చిన్నారి మృత్యుముఖం నుంచి బయటపడిన సంఘటన ముంబైలోని వాంఘాని రైల్వే స్టేషన్ 2 వ ప్లాట్‌ఫాం వద్ద జరిగింది. ఫ్లాట్ ఫాం పైనుంచి మ‌రొక మ‌హిళ‌తో న‌డుచుకుంటూ వెళ్తోన్న ఓ చిన్నారి ఒక్క‌సారిగా అదుపుత‌ప్పి రైలు ప‌ట్టాల‌పై ప‌డిపోయాడు. ఇంత‌లో ఓ రైలు అదే ప‌ట్టాల‌పై దూసుకొస్తోంది. ప్లాట్ ఫాం పై ఉన్న మ‌హిళా భ‌య‌ప‌డుతూ ఉండిపోయింది. పట్టాలపై పడిపోయిన చిన్నారిని గమనించిన  రైల్వే ఉద్యోగి మయూర్ షెల్ఖే  శర వేగంగా కదలిలారు. రైలుకు ఎదురెళ్లి మరీ చిన్నారిని పట్టాలమీది నుంచి తప్పించి, అంతే వేగంగా తను కూడా తప్పుకున్నారు. ఇదంతా కొన్ని సెకన్ల  వ్యవధిలోనే జరిగింది. దీంతో క్షణాల్లో ప్రాణాపాయం తప్పింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో  రికార్డుయ్యాయి. ఈ వీడియోను దక్షిణ మధ్య రైల్వే షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ విజువల్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement