Sunday, April 28, 2024

కొండెక్కిన చికెన్ ధర

నాన్ వెజ్ ప్రియులకు చికెన్ ధరలు దడ పుట్టిస్తున్నాయి.  చికెన్ కొనాసంటేనే జనం హడలిపోతున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో చికెన్ ధరలు 250 రూపాయలపైనే ఉంది. ఇక సండే వచ్చిందంటే చాలా ఈ దర అమాంత్ రూ.300 వరకు పెరుగుతోంది. ఎప్పుడు వేసవిలో పెరిగే చికెన్ ధరలు..ఇప్పుడు వానాకాలంలోనూ భారీగా పెరిగింది. కరోనా నేపథ్యంలో పౌష్టికాహారం తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్న నేపథ్యంలో చికెన్ కు డిమాండ్ పెరుగుతోంది. దీంతో చికెన్ ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. మార్కెట్లో డిమాండ్ పెరగడంతో చికెన్ వ్యాపారులు ధరలను విపరీతంగా పెంచేస్తున్నారు. దీంతో ప్రజలు చికెన్ కొనేందుకు జంకుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement