Sunday, May 12, 2024

కొత్త సెల్ ఫోన్ కొనివ్వాల్సిందే!!

కరోనా మహమ్మారి కట్టడి చేసేందుకు దేశంలో కొన్ని ప్రాంతాలలో లాక్ డౌన్ విధిస్తున్నారు. అయితే లాక్ డౌన్ టైంలో కూడా చాలామంది బయట తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే చత్తీస్ ఘడ్ ఐఏఎస్ అధికారి ఓ వ్యక్తిని చెంపదెబ్బ కొట్టి అతని సెల్ ఫోన్ నేలకేసి కొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఐఎఎస్ అధికారి వెంటనే సస్పెండ్ అయ్యారు. కాగా బాధితుడికి కొత్త ఫోన్ కొనివ్వాలంటూ చత్తీస్ ఘడ్ సీఎం భూపేష్ బాగేల్ ఆదేశాలిచ్చారు.

తాజాగా తప్పుడు ప్రవర్తన కనబరిచిన ఐఏఎస్ కొత్త ఫోన్ కొని ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా సూరజ్ పూర్ జిల్లా కలెక్టర్ రణబీర్ శర్మ రోడ్డుపై చంప దెబ్బ కొట్టిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement