Saturday, May 4, 2024

భరత మాత ముద్దుబిడ్డ ఛత్రపతి శివాజీ మహారాజ్ : మంత్రి ఎర్రబెల్లి

ఛత్రపతి శివాజీ మహారాజ్ భరత మాత ముద్దుబిడ్డ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తొర్రూరు బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో శివాజీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. హిందూ వాహిని అధ్వర్యంలో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. భారత దేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి, మొగల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన మహానుయోధుడని కొనియాడారు. శివాజీ చ‌రిత్ర‌ స్ఫూర్తిదాయకమని అన్నారు. స్త్రీలను గౌరవించి, హిందూ ధర్మానికి వన్నెతెచ్చిన వీరుడని ప్రశంసించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలను, ఆశయాలను పిల్లలకు తల్లిదండ్రులు బోధించాలని సూచించారు.

పాలమూరు జాతరలో అపరిశుభ్రతపై మంత్రి ఎర్రబెల్లి ఆగ్రహం..
పాలకుర్తి జాతరలో పరిశుభ్రత పనితీరును మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదివారం పరిశీలించారు. పరిశుభ్రతను పాటించని యజమానులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశుభ్రత ప్రజలకు అవగాహన పెంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శివ పార్వతుల కల్యాణం, జాతర ఘనంగా నిర్వహించడానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. చెత్త చెదారం ఉన్న దుకాణం వద్దకు వెళ్లి అధికారులతో జరిమానాలు విధించారు. రోడ్లపై చెత్త చెదరాలు వేయొద్దని జాతరకు వచ్చిన భక్తులకు పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement