Friday, May 3, 2024

చెరువుగట్టులో కళ్యాణ మహోత్సవం

నార్కట్ పల్లి ( ప్రభ న్యూస్): న‌ల్గొండ జిల్లా చెరువుగట్టు పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. స్వామి వారిని నంది వాహనంపై, అమ్మవారిని పల్లకిలో ఊరేగించి కల్యాణ వేదికపై ఆశీనులు చేశారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి, అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం భక్తుల శివనామస్మరణలు.. మంగళవాయిద్యాల మధ్య వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రభుత్వం తరఫున నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కార్యక్రమంలో ప‌లువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement